మత్స్యగిరి ఆలయంలో ఈనెల 4వ తేదీన హనుమాన్ జయంతి

Published: Thursday June 03, 2021

వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గుట్ట పైన 4వ తేదీన శుక్రవారం రోజున శ్రీ హనుమన్ జయంతి సందర్భముగా లోక కల్యాణం కొరకు. కరోనా వ్యాధి నివారణ జరిగి ప్రజలంతా ఆరోగ్య సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి సుగంధ ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకం మరియు నాగావళి దళార్చన అర్చకులచే అంతరంగికముగా నిర్వహించబడును. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు భక్తులకు దేవాలయ ప్రవేశం అనుమతి లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి పత్రిక ప్రకటనలో తెలిపారు.