అకాల వర్షాలు ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి

Published: Friday April 16, 2021
మధిర, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : తేదీమొన్నటి దాకా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చేతికందకుండా చేసి, వారిని నిండా ముంచిన వర్షాలకు పిడుగు పాటులు కూడా తోడయ్యాయి. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేదలపై ప్రకృతి ప్రకోపం చూపింది. మధిర మండలంలో కురిసిన అకాల వర్షాలకు తోడు పడిన పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటనలో గొర్రెల కాపరి మహబూబాబాద్ కు చెందిన నరసింహ యాదవ్ 45 ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందడు. నిరుపేద కుటుంబానికి చెందిన తను మరణించడంతో తనపై ఆధారపడి బతుకీడుస్తున్న కుటుంబం రోడ్డున పడింది. ప్రకృతి ప్రకోపానికి బలైన తన కుటుంబని ఆదుకోవాలని మల్లారం గ్రామ సర్పంచి మదడపు ఉపేంద్రర్, స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.