పలు కాలనీలలో అభివృద్ధి పనులు

Published: Friday February 12, 2021

బాలాపూర్: ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ 8వ, 9వ, 27వ, డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో  పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ కలిసి  శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ ఉన్నత ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ..... వచ్చే వేసవికాలం లో ప్రజలకు ఏలాంటి మంచి నీటి సమస్య రాకుండా చూడాలిని అన్నారు. కాలనీవాసులు అందరికీ పరిశుభ్రతను పాటించాలినీ గుర్తు చేశారు. వివిధ కాలనీలలో డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి కావాలని సిబ్బందికి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్,  కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి,  డి ఈ అశోక్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, 8వ డివిజన్ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన, 9వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, 27వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి, పలు కాలనీ వాసులు అందరూ తదితరులు పాల్గొన్నారు.