కరోనాతో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలి
Published: Thursday November 03, 2022
జన్నారం ఐద్వా మండల అధ్యక్షురాలు పోతు విజయ శంకర్
జన్నారం, నవంబర్ 02, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కరోనా వైరసుతో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బుధవారం ఐద్వా మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలు నష్ట పరిహారం అందక ఇబ్బందులకు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని 29 గ్రామపంచాయతీలలో కరోనాతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు కొందరికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామా పరిధిలలో కరోనా వైరసుతో మృతి చెందిన వారి కుటుంబీకులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Share this on your social network: