మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి
Published: Monday May 03, 2021
- చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్ర నగర్, సిటిజన్ కాలనిలలో కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ప్రతి ఏడాది ఇచ్చె రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జరుగుతుందన్నారు. నీరుపేద ప్రజలకు అండగా ఉండాలని షాది ముబారక్, రంజాన్ తోఫా పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పేట్టడం జరిగిందన్నారు. కరోనా వేంటాడుడుతున్న ప్రజలు పండగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తేన్నారని తెలిపారు. పేద, ధనిక తారథమ్యాలు లేకుండా అందరూ పండుగలను అంతే సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం రంజాన్ తోఫా పంపిణీ ప్రారంభిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పర్వదినాలను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు.
Share this on your social network: