భరత్ విద్యార్థులు ఆధ్వర్యంలో జై కేసీఆర్ రైతుబంధు వర్ధిల్లాలి అనే అక్షరాల మాలగా ఏర్పాటుచేస
Published: Thursday January 06, 2022
మధిర జనవరి 5 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని భరత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల బుధవారం నాడు మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు రైతుబంధు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు జై కెసిఆర్ రైతుబంధు వర్ధిల్లాలి అనే అక్షరమాలగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి, మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత, టిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, యువజన నాయకులు కూన నరేందర్ రెడ్డి, వాల్మీకి పవన్, రామన్, ఇక్బాల్, నాని తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: