ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

Published: Tuesday November 16, 2021
బాలాపూర్ నవంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్  లో సోమవారం రోజు బడంగ్ పేట్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బడంగ్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్. స్కూల్ లోని విద్యార్థులను చదువు పై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్య మంచిగా బోధిస్తున్నా విధానాన్ని, అదేవిధంగా పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయని  స్కూల్ ను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉన్నాయా.... లేవా అని విద్యార్థులను అడిగి తెలుసుకొని, స్కూల్ ఆఫీసులో ఉపాధ్యాయుల మీటింగ్ లో  చర్చించారు. సైన్స్ బోధించే ఉపాధ్యాయుల విధానాన్ని విద్యార్థులకు అర్థమవుతున్నట్లు ఇబ్రమ్ శేఖర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్జున్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.