భారత రాష్ట్రపతి రాకతో ఆంక్షలు విధించిన పోలీస్ డిపార్ట్మెంట్..... అత్యవసరమైతే తప్ప బయటకు రావద్

Published: Wednesday December 28, 2022

28 బుధవారం రోజున రాష్ట్రపతి భద్రాచలం పర్యటన నేపథ్యంలో అశ్వాపురం మండలంలోని మొండికుంట- ఇరవెండి మొండికుంట- భద్రాచలం క్రాస్ రోడ్ వరకు భద్రత చర్యల దృష్ట్యా ఉదయం 5:00 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని. కావున ప్రయాణికులు బుధవారం రోజు ప్రయాణాలను వాయిదా వేసుకొని సహకరించగలరని కోరనైనది, ప్రజలకు ఏదైనా అత్యవసరమైతే నిరంతరం పోలీసులు అందుబాటులో ఉంటారని డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారి సేవలను పొందవచ్చునని అశ్వాపురం సిఐ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము  రాకతో ఈ ఆంక్షలు  విధించడం జరిగినదని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది.