ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడపాలని జగ్గయ్యపేట డి ఎం కు వినతి పత్రం

Published: Thursday May 19, 2022
బోనకల్, మే 18 ప్రజా పాలన ప్రతినిధి: టి ఎస్ ఆర్ టి సి వారి నిర్లక్ష్య వైఖరితో ఏపీఎస్ఆర్టీసీ జగ్గయ్యపేట డిపో నుండి జగ్గయ్యపేట వైరా నడిచే బస్సు సర్వీసులను ఆపివేయాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం రోజున వైరా నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్ రాములు నాయక్ ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను నిలుపుదల చేయకుండా యదావిధిగా నడపాలని జగ్గయ్యపేట డి ఎం కు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ఇచ్చిన రిప్రజెంటేషన్ లేఖను బుధవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ జగ్గయ్యపేట డిపో మేనేజర్ను కలిసి అందజేశారు. అలాగే జగ్గయ్యపేట డిపో బస్సులు మండల కేంద్రంలో గల బస్టాండ్ కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ ,ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.