మాదారం ఎంపీఎల్ విజేతలకు బహుమతి అందజేసిన ఎంపీపీ సుదర్శన్

Published: Saturday April 01, 2023
మేడ్చల్ జిల్లా(ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మాదారం గ్రామంలో (MPL 4) మాదారం ప్రీమియర్ లీగ్ 4 పూర్తిచేసుకుని గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి విజేతలకు అతని చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మాదారం గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమని, గ్రామ యువత ఐక్యమత్యంగా ఉందని, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని హర్షం వ్యక్తం చేశారు. యువత క్రీడల్లోనే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి ఎటువంటి సాయం కావాలన్నా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఎల్లవేళలా ప్రజలకు తోడుగా నిలుస్తుంది అని అన్నారు. తాను కరోనా సమయంలో మాదారం గ్రామానికి చేసిన సేవ ఎన్నటికీ మరువలేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్లోల్ల యాదగిరి, ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్లు, నిర్వాకులు ప్రభాకర్, కృష్ణ సాయి,సంతోష్ ,దయాకర్, ఉపేందర్, నరేష్, వేణు, తదితరులు గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.