మాటూర్ హైస్కూల్ విద్యార్థులకు కరోన పరీక్షలు నిర్వాహణ

Published: Tuesday March 16, 2021
మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి5ఈ రోజు మండల పరిధిలోని మాటూర్ పేట ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్య అధికారి పర్యవేక్షణలో మాటూర్ హైస్కూల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో RBSKB టీం డాక్టర్ ప్రేమ్ కుమార్ బృందం మాటూర్ Phc డాక్టర్ వెంకటేష్ ల ఆధ్వర్యంలో మాటూరు హైస్కూల్ విద్యార్థులకు కరోనా టెస్ట్ ల తో పాటు చిరు వ్యాధులకు చికిత్స అందించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేసినారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు నెగెటివ్ రిపోర్ట్స్ గా ఫలితాలు వచ్చాయి. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించారు. ఈ కార్యక్రమం లో HM D. సాయికృష్ణమాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, HS భాస్కర్ రావు, HS మరియరాణి, RBSK ANM మణి, PHC ANM P. సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.