ఆర్టీసీ బస్టాండ్ నందు ఫ్రిజ్ ప్రారంభించిన డిఎం ఎస్ దేవదానం

Published: Saturday April 08, 2023
మధిర ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు
వేసవి తాపం నుండి బస్సు ప్రయాణికులకు చల్లని మినరల్ త్రాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్ లో    ఫ్రిజ్  లను ఏర్పాటుచేసిన ఎండి సజ్జనర్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ  ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  బస్టాండ్  ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి తాపం దృశ్య చల్లని త్రాగునీరు అందించే దానిలో భాగంగా మినరల్ వాటర్ తో కూడిన చల్లని త్రాగునీటిని అందించేందుకు ఫ్రిజ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మధిర డిపో పరిధిలోని వైరా , తల్లాడ మధిర స్టాండ్లకు ఫ్రిజ్ ను ఏర్పాటు చేసేదానిలో భాగంగా నేడు మధిర డిపో మేనేజర్ ఎస్ దేవదనం ఫ్రిజ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ హెడ్ ముత్యాలరావు టి 12  బి వెంకటేశ్వర్లు,  సూపర్వైజర్స్, కండక్టర్లు, డ్రైవర్లు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.