సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు

Published: Monday January 10, 2022
మేడిపల్లి, జనవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి) : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3, 12, 13, 22 మరియు 24వ డివిజన్లలో సాయి ఐశ్వర్య కాలనీ, మారుతి నగర్ పార్క్, సాయిబాబా గుడి, బుద్ధనగర్ కాలనీ, పిటి కాలనీలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ స్థానిక కార్పొరేటర్లు బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి, అమర్ సింగ్, తూముకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీధర్ రెడ్డి, భీంరెడ్డి నవీన్ రెడ్డి, వై.అనంత రెడ్డి, డి.హరీశంకర్ రెడ్డి పాల్గొని ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, వనంపల్లి గోపాల్ రెడ్డి, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.