ఇరుముడిలో పాల్గొన్న బాధావత్ సైదులు నాయక్..
Published: Tuesday November 29, 2022
వైరా, నవంబర్ 28 (ప్రజా పాలన న్యూస్):
వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలోని ఉప్పల చిలక గ్రామంలో సోమవారం అయ్యప్పల ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ లంబాడ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ సైదులు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వాములను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు 40 రోజుల పాటు కఠోర దీక్ష చేసి చివరిరోజు శబరిమల వెళ్లి మొక్కులు తీర్చుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు మంగీలాల్, సంతులాల్, గుగులోతు నాగేశ్వరరావు, గుగులోతు బాలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: