విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: మధిరరూరల్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలి

Published: Saturday February 11, 2023
 తేళ్ల వసంతయ్య కుమారుడు, అమెరికా వాసి వెంకటేశ్వర రావు తమ సతీమణి డాక్టర్ నళినాక్షి, కుమారుడు డాక్టర్ మల్లిక్, కుమార్తె డాక్టర్ స్వాతి, ఇతర కుటుంబ సభ్యులతో సహా సందర్శిం చారు. దివంగత వసంతయ్య విగ్రహానికి పూల మాలలు  వేసి, నివాళులు అర్పించారు.  ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది, పూర్వ విద్యార్థి సంఘ బాధ్యులతో మాట్లాడి, పాఠశాల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ విద్యాసంస్థకు తమ "తేళ్ల నల్లూరి ఫామిలీ ట్రస్ట్"  ద్వారా కల్పించిన సౌకర్యాలను సద్వినియాగం చేసుకుని, బాగా చదివి, అభివృద్ధిలోకి రావాలని, ఆకాంక్షించారు.
ఈ సందర్భాన్ని పురస్క రించుకొని, పూర్వ విద్యార్థి సంఘ బాధ్యులు, పాఠశాల సిబ్బంది, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను, శాలువలతో ఘనంగా సత్కరించి, వారు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, మాధవరపు నాగేశ్వరరావు, చేరుపల్లి శ్రీధర్, హెచ్.ఎమ్. నారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు: మాధవరపు నాగేశ్వరరావు, ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు