కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటా!* మాజీ ఎంపీ పొంగులేటి*

Published: Monday November 14, 2022
మధిర  నవంబర్ 13 ( ప్రజా పాలన ప్రతినిధి) కష్టాల్లో ఉన్న జిల్లా ప్రజలకు నిరంతరం అండగా ఉంటానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని  విస్తృతంగా పర్యటించి ఇటీవల మృతి చెందిన  కుటుంబాలను పరామర్శించడం తోపాటు పలు శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటాన న్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య రైతుబంధు మండల సమితి మాజీ కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం కవిత సిద్దినేని గూడెం సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి నాగవరప్పాడు మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది చావాలి రామ రాజు యాదవ్ ఎర్రగుంట రమేష్  అక్కినపల్లి నాగేశ్వరరావు శీలం వెంకటరామిరెడ్డి మాజీ సర్పంచ్ బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.