23లక్షల నిధులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ శ్రీనివాసరావు

Published: Thursday June 09, 2022
తల్లాడ, జూన్ 8 (ప్రజాపాలన న్యూస్):
 
 *తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాఠశాల భవనాల మరమ్మతులకు 23 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులకు ఎంపీపీ శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో శ్రమదానం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, ఎంపీటీసీ బానోతు మోహన్, హెచ్ఎం వెంకటేశ్వరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి చంద్రయ్య, కళ్యాణపు కృష్ణయ్య, కళ్యాణపు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.*