మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు అవ్వడం గర్వకారణం ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ న

Published: Friday October 28, 2022
జన్నారం, అక్టోబర్ 27, ప్రజాపాలన: ఏఐసీసీ నూతన అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికవ్వడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకునికి ఎంతో గర్వకారణంగా ఉందని, దళిత సామజిక వర్గానికి చెందిన నేతకి అవకాశం ఇచ్చిన గాంధీ కుటుంబంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గురువారం ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ అన్నారు. ఈ సందర్బంగా వినోద్ నాయక్ మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాంమని చెప్పి మాయమాటలు చెప్పే పార్టీలా కాకుండా ఇవాళ వెనుకబడిన వర్గాలకి జాతీయ పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీలో ఉండడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఇవాళ రాష్ట్రoలో బీజేపీ, తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాజకీయ వ్యభిచారంకి పాల్పడుతున్నారని,100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొనే స్థాయిలో పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, అంటే వీళ్ళ అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందొ అర్థము చేసుకోవాలని ప్రజలకి సూచించారు. కాబట్టి ఇలాంటి పార్టీలని అధికారం నుండి దించాలంటే ప్రతి కార్యకర్త మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఫసిఉల్లా, రెండ్లగూడ ఎంపీటీసీ కరుణాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇందయ్యా, పట్టణ అధ్యక్షుడు దుమాల్ల రమేష్, ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు శ్రీను గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శులు ఇమ్రాన్, హేమంత్ చారీ, నాయకులు నరేష్ పటేల్, రాజు నాయక్, మంద రాజేష్, బచ్చల శివ, పంజలా రవి, శేఖర్ రాజురీ తదితరులు పాల్గొన్నారు.