నర్సరీ పనులు వేగవంతం చేయాలి : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Friday November 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : నర్సరీ పనులలో వేగవంతం చేయాలని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ సూచించారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని కొంషేట్ పల్లి, మొగలిగుండ్ల, పట్లూరు గ్రామ పంచాయతీల నర్సరీలను సందర్శించడం జరిగింది. ఎర్రమట్టి, నల్ల మట్టి కొట్టిన వెంటనే జల్లెడ పట్టించి సేంద్రియ ఎరువు కలిపి నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రెండు రోజులలో పూర్తి చేయాలని కార్యదర్శులకు అదేశించారు. అనంతరం అవెన్యూ ప్లాంటేషన్, ఎంఎల్ఎపి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాలని వివరించారు. ట్యాంకర్ పేమెంట్ వాచర్ పేమెంట్ వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయకులు రఫి, కోమ్స్గేట్ పల్లి, కార్యదర్శి అనిత మొగ్లింగుండ్ల సర్పంచ్, కార్యదర్శి రాములు, పట్లర్ సర్పంచ్ ఇందిరా అశోక్ సంతోష కార్యదర్శి పాల్గున్నారు