తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర యువనాయకులు బంటి

Published: Friday August 27, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం లోయ పలి గ్రామంలో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకయైన తీజ్ పండగను రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం లోయపల్లి గ్రామంలో తీజ్ ఉత్సవాలను గిరిజన ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో వారు ప్రదర్శించిన ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు గిరిజన తండాల్లో సందడిగా మారడమేగాక నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాలలో ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు  తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా గా పండాలని వారి ఆకాంక్షలు నెరవేరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మదా, సర్పంచ్ మంగశ్రీనివాస్, తెరాస నాయకులు కర్నాటి రమేష్ గౌడ్, మహమ్మద్ ఖాజు, చీరాల రమేష్, బద్రీనాథ్ గుప్తా, జెర్కొని రాజు, బంటి యూత్ ఫోర్స్ అధ్యక్షులు అంగోత్ ప్రవీణ్ నాయక్ (బొట్టు) యువజన సంఘాలు, ప్రజలు  పాల్గొన్నారు.