ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు
Published: Friday December 10, 2021
తల్లాడ, డిసెంబర్ 9 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో అడ్వాన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ప్రారంభించారు. స్థానిక షాలేము వాగ్దాన ప్రార్ధన మందిరం సమీపంలో శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ డాక్టర్ సయ్యద్ యూసుఫ్ అలీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. నడిపల్లి విల్సన్, వానవర్ల ప్రసాద్ రావు ఆత్మీయ అతిధులుగా హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన స్థానిక పాస్టర్ సాల్మన్, కవిత దంపతులు అభినందనలు తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, వార్డు మెంబర్ గార్లపాటి నరసింహారావు, నారపోగు జమలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: