రేపు మణుగూరులో జరగబోయే టి యు డబ్ల్యూ ఐజే యు డివిజన్ మహాసభను విజయవంతం చేయండి .... బూర్గంపాడు ( ప్
Published: Tuesday January 03, 2023
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కిరెడ్డి మల్లారెడ్డి, డొంకన చంద్రశేఖర్ సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మణుగూరు మండలం తో గూడెం గ్రామంలో శివం ఫంక్షన్ లో జరిగే టి యు డబ్ల్యు ఐజేయు డివిజన్ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
మిత్రులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈనెల3 వ తేదీన టి యు డబ్ల్యూ జే ఐ జేయు యూనియన్ డివిజన్ మహాసభను మణుగూరు లోని తోగ్గూడెం గ్రామంలో గల శివం ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుందని కావున మిత్రులంతా ఈ మహాసభకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేసి యూనియన్ సభ్యులకు సమాచారం చేరవేయాలని వారి సందర్భంగా కోరారు.
ఈ మహాసభలో జర్నలిస్టుల సమస్యలు ఇళ్ల మంజూరు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
డివిజన్ మహాసభకు ప్రతి ఒక్కరు హాజరై ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Share this on your social network: