ఎర్రుపాలెం మండల బిఆర్ ఎస్ కార్య నిర్వహణ

Published: Monday April 10, 2023

కార్యదర్శిగా గొల్లపూడి యాకోబు . ఎర్రుపాలెంఏప్రిల్ 9 ఆదివారం ప్రజా పాలన ప్రతినిధి ఈరోజు మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన గొల్లపూడి యాకుబు మండల టిఆర్ఎస్ కార్య నిర్వహణ అధికారిగా మండల అధ్యక్షులు పంబి. సాంబశివరావు,మరియు కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ,ఆదేశాల మేరకు. మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ కృషితో స్థానిక ఎర్రుపాలెం మండల పార్టీ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది . ఈ సందర్భంగా గొల్లపూడి యాకోబు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాయకులు చావ రామకృష్ణ , పంబి.సాంబశివరావు ,నాకు ఈ పార్టీ పదవి అప్పజెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గ్పార్టీ కట్టుబాట్లకు విధేయుడనై ఉంటానని.నాయకుల ప్రోత్సాహంతో ముందు ముందుకు సాగుతానని అందరి ప్రోత్సాహం తోడ్పాటు , అండదండలు మెండు గా ఉండాలని వాగ్దానం చేస్తున్న. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సద్గుర్తి.కిషోర్ బాబు ,మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి

భాస్కరరావు, మాజీ ఎంపీటీసీ కాపు వరప్రసాదరావు, తోటపల్లి బాలరాజు, మల్లవరపు బాలాజీ ,వెంకటరత్నం, ముఖ్య నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.