కోదండరాం మౌనదీక్ష కు మద్దతుగా ఎలుక కమలాకర్ మౌనదీక్ష

Published: Monday May 31, 2021
మల్లాపూర్, మే 30 ప్రజాపాలన ప్రతినిధి : ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అత్యవసరమైన 9 డిమాండ్లను ఆదివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతూ, డిమాండ్ల సాధనకు ప్రొఫెసర్ కోదండరాం మౌనదీక్ష ను హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో చేపట్టారు. కోదండరాం మౌనదీక్ష కు మద్దతుగా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్ చెందిన జగిత్యాల జిల్లా టి జె ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్ తన స్వంత ఇంట్లో కోవిడ్ నిబంధనలతో మౌన దీక్ష చేపట్టారు. కమలాకర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం  సూచించే 9 డిమాండ్లు రాష్ట్ర కేబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.