బల్కంపేట ఎల్లమ్మ గుడిని సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

Published: Friday March 05, 2021
అమీర్ పేట (ప్రజాపాలన ప్రతినిధి): హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ బల్కంపేట ఎల్లమ్మ గుడిని సందర్శించి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతీ ఏటా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.