బెల్లంపల్లి పట్టణ తెరాస మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎండి.ఎజాజ్ నియామకం

Published: Wednesday February 09, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి  పట్టణ తెరాస మైనారిటీ సెల్ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు ఎండి ఎజాజ్ ను నియమించినట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మంగళవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియామక పత్రం అందజేసిన అనంతరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ పదవులు తీసుకోవడం కాదని పదవులకు తగిన న్యాయం చేయాలని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అప్పుడే దానికి అర్థం ఉంటుందని ఆయన అన్నారు. ఈ సంధర్బంగా ఎజాజ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ ని నమ్ముకొని,పార్టీ ఆదేశానుసారం చెప్పిన పనులను  చేశానని,నాకు ఈ పదవి రావడం మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. తనను అధ్యక్షులుగా నియామకం చేసినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కి, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత కు, వైస్ చైర్మన్ సుదర్శన్ కు, పట్టణ అధ్యక్షులు బొడ్డు నారాయణకి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్లు గెల్లి రాయలింగు, రాములునాయక్, సురేష్, రమేష్, అశోక్ గౌడ్, నిలికృష్ణ, చంద్రశేఖర్, సూరం సంగీత బానేష్, మంగమూర్తి, గోలిశివ, సాన శ్రావణ్, హనీఫ్ లకు ఆయన ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. నూతన అధ్యక్షులు గా ఎన్నికైన ఎజాజ్ ను పట్టణ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కలిల్, సభ్యులు సలీమ్, ఉల్ఫాత్, సిరాజ్, సర్వర్ లు  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో పాటు తెరాస ప్రజా ప్రతినిధులు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.