ఐదు లక్షల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Friday November 26, 2021

బీరుపూర్, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రానికి చెందిన పూడురి గంగాధర్ కిడ్నీ వ్యాధితో గత ఏడాది కాలంగా భాదపడుతుండగా కిడ్నీ మార్పిడి కోసం ఐదు లక్షలు రూపాయల అవసర నిమిత్తం నిరుపేద కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను కలవగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే ట్రాన్స్ ప్లాంటేషన్ కు అవసరమైన ఐదు లక్షల రూపాయల ఎల్వోసిని గురువారం రోజున హైదరాబాద్ లో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఐదు లక్షలు ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపుర్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ సారంగాపూర్ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు జోగినపల్లి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.