అన్ని దానాల కంటే అన్నదానం మిన్నమధిర రూరల్ డిసెంబర్ 15
Published: Friday December 16, 2022
అన్ని దానాల కంటే అన్నదానం మిన్నమధిర రూరల్ డిసెంబర్ 15 (ప్రజా పాలన ప్రతినిధి) అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఆయుష్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రాంబాబు హేమలత దంపతులు అన్నారు. గురువారం స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద కందుల మల్లమ్మ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల రాంబాబు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి గురువారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network: