*పుల్వామా అమర జవాన్లకు నివాళులు* -ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్

Published: Wednesday February 15, 2023
చేవెళ్ల: (ప్రజాపాలన):
 
చేవెళ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో   పుల్వామా అమర జవాన్లకు నివాళులర్పించిన ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్*
మాట్లాడుతూ పుల్వామా దాడిలో దాదాపు 40 మంది సైనికులు ఉగ్రవాదుల చేతిలో అమరులయ్యారని ఈ దేశం కోసం వారి ప్రాణత్యాగం చాలా గొప్పవని దేశ ప్రజల రక్షణ కోసం అమర జవాన్లు ప్రాణ త్యాగం చేశారని వారిని ఈ రోజు స్మరించుకొని వారి ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని విద్యార్థులందరూ వారందరినీ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులు మిలిటరీలో చేరాలని దేశానికి ప్రజలకు సేవ చేయాలని వివరించారు. దేశ సైనికులు ఎండా, వాన,చలి ని లెక్కచేయకుండా దేశ సరిహద్దులలో ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారని దేశ ప్రజలందరూ కంటినిండా నిద్రపోతున్నారు అంటే దానికి జవానుల యొక్క త్యాగం ఎంతో గొప్పదని అన్నారు.
ఈ  కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  మండల నాయకులు నితీష్. సాయి. చందు. గణేష్. సాయి కుమార్. సిద్దు. తదితరులు పాల్గొన్నారు.