మధిరలో ఇంటింటికి కోవిడ్ వాక్సిన్ బృందం సర్వే.. సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి
Published: Friday December 10, 2021
మధిర డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా పాలనా అధికారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనలతో మధిర మున్సీపా లిటీ పరిధిలో వీధి వీధి కి పారా మెడికల్ టిమ్ ఇంటింటికి తిరుగుతూ కోవిడ్ వాక్సిన్ టార్గెట్ మరియు ఆన్ లైన్ పక్రియ సంపూర్ణoగా పూర్తి చేయటం కోసం సర్వే బృందాలు ఇంటింటికి వస్తున్నారు అని వైద్య అధికారులు డా.వెంకటేష్ డా.శశిదర్ డాక్టర్ అనిల్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ రమదేవి మేడం వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మధిర టౌన్లో ఉన్న 18+ మరియు సీనియర్ సిటిజెన్ అర్హత గల వారు కోవిడ్ వాక్సిన్ వెంటనే వేయించు కోవాలని సహృదయంతో తెలియజేస్తున్నారు జిల్లా సర్వ్ లెన్స్అధికారీ, జిల్లా వ్యాది నిరోధక టీకాలు అధికారి డా రాజేష్ గారు సర్వే బృందలను స్థానిక వైద్య అధికారులు చేమానిటీరింగ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరివేక్షకులు హెచ్స్ లంకా కొండయ్య హెచ్స్ కాంతలీల ఎఎన్ఎం లు విజయకుమారి భారతి వై లక్ష్మి విజయలక్ష్మి విజయ, రాజేశ్వరి, నాగమణి అరుణ, హెచ్ఎ గుర్రం శ్రీను హెచ్ఎ నాగేశ్వర్రావు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: