అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య..
Published: Monday February 20, 2023
తల్లాడ, ఫిబ్రవరి 18 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో శ్రీ కమలేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, కృష్ణవేణి దంపతులు, కళ్యాణపు పెద్ద శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చోని మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య హాజరై మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం తూము శ్రీనివాసరావు దంపతులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులను శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం స్వామి వారి కళ్యాణాన్ని భక్తులందరూ వీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెం వీర మోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, కళ్యాణపు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.*
Share this on your social network: