గ్యాస్ ధరలు తగ్గించాలని కొనిజర్లలో రాస్తారోకో

Published: Saturday March 04, 2023
కొనిజర్ల,  మార్చి 3 ప్రజా పాలన న్యూస్

 బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం, పార్టీ అధ్యక్షులు తాతా మధు, వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశానుసారం కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో కొణిజర్ల నందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు పిఎసిఎస్ చైర్మన్ చెరుకుపల్లి రవి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారి మాధవరావు సుడా డైరెక్టర్ బండారి కృష్ణ జిల్లా నాయకులు దొడ్డపనేని రామారావు బోడపోతుల బాబు పోట్ల శ్రీనివాసరావు తాళ్లూరు చిన్న పుల్లయ్య ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఎంపీటీసీలు తేజవత్ కుమారి దొడ్డపనేని లలిత కుమారి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబూలాల్, కొచ్చర్ల బిక్షం సర్పంచులు షేక్ కాసింబి, రాయల నాగేశ్వరరావు, రాంబాబు, కాంపెల్లి స్వప్న మండల మీడియా కోఆర్డినేటర్ భూక్య నరసింహ మండల యూత్ అధ్యక్షుడు వడిత్యా రంగా, మండల కో ఆప్షన్ సభ్యులు మౌలానా, తదితరులు పాల్గొన్నారు.