ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
Published: Thursday July 22, 2021
మెట్ పల్లి, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ నాయకులు సెల్ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. దీన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద నిరసన, రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Share this on your social network: