కరోనాను అరికట్టడంలో ప్రజలు సహకరించాలి : కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే7 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశలో విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని ఉప్పల్ కార్పొరేటర్ మందముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నివారణలో ముందస్తు చర్యల్లో భాగంగా కార్పొరేటర్ డివిజన్లో సాయిబాబా కాలనీ, బుడగజంగాల కాలనీలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గుజుల నర్సింహా రెడ్డి, రత్నం, వర్కాల మదన్ గౌడ్, సురేష్, మంద మురళీకృష్ణ రెడ్డి, జీతు, నరేష్, చింటూ, వీరప్ప, వీరేష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: