కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని మాటలను వెనక్కి తీసుకోవాలి..

Published: Friday February 04, 2022
బీజేపీ మండల అధ్యక్షుడు ఆపతి రామారావు..
తల్లాడ, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన న్యూస్): భారత రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్, బుద్ధి తెచ్చుకుని తన మాటలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ తల్లాడ మండల అధ్యక్షులు అపతి రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన కెసిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో తల్లాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ ని అవమానించేలా మాట్లాడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తేజావత్ బాలాజీ నాయక్, వాడవల్లి నాగేశ్వరరావు, గొల్లమందల నరేష్ తదితరులు పాల్గొన్నారు.