సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Wednesday July 28, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని జంగారెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ సర్పంచ్ శివరాత్రి ఎల్లమ్మ భర్త రాములు మృతి చెందగా మంగళవారం భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్, సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ఎం పి టి సి పలసం రమేష్, మాధ శంకర్ గౌడ్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.