నేడు ఖానాపురం లో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాలు

Published: Tuesday August 31, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి : 10 వార్డు కౌన్సిలర్ పి.శంకరయ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపురం గ్రామంలో నేడు మంగళవారం ఎల్లమ్మ అమ్మవారి బోనాల వేడుకలు జరుగుతాయని ఖానాపూర్ 10వ వార్డు కౌన్సిలర్ పంది శంకరయ్య తెలిపారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించి తన మొక్కులను తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నామని తెలిపారు. ఈ బోనాల వేడుకలకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి ఆలయ కార్యవర్గానికి సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరడం జరిగింది.