నాగిరెడ్డి గూడెంలో పల్లె ప్రగతి, హరితహారం
Published: Thursday July 08, 2021
గుమ్మడిదల మండలంలోని నాగిరెడ్డి గూడెం గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గడ్డం హన్మంతరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి,జడ్పీటీసీ కుమార్ గౌడ్ తో కలసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని పల్లె పకృతి వనంను నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, దళిత వాడలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మండల్ స్పెషల్ ఆఫీసర్ టి.ప్రసాద్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీఓ దయాకర్ రావు, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ ఎండి జహంగీర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: