*ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి డాక్టర్ వాసిరెడ్డిరామనాథం

Published: Tuesday September 27, 2022
మధిర సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి సేవా దృక్పథంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. సోమవారం మధిర  విజయవాడ రోడ్లో ప్రముఖ మల్టీ స్పెషల్టీ దంత వైద్య నిపుణులు డాక్టర్లు కేసర శ్రీకాంత్, అనూష లచే నూతనoగా ఏర్పాటు చేసిన డెంటినోవా మల్టీ స్పెషాలిటి దంత వైద్యశాలను డాక్టర్ వాసిరెడ్డి రామనాథం చేతుల మీదుగా ప్రారంభించారు. అదే విధంగా అత్యాధునిక వైద్య మిషన్ లను ప్రత్యేక క్లినిక్ రూమ్ లను  రిటైర్డ్ మహబూబాబాద్ జిల్లా డిప్యూటీ డియంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు మధిర సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యులు  అనిల్ కుమార్ ల చేతులు మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా డాక్టర్ రామనాదo మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో
అదునాతన మల్టీ డెంటల్ వైద్య సదుపాయం డెంటినోవా ద్వారా మధిర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.