స్వచ్చందంగా రక్తదానం చేసిన విద్యార్థి నాయకుడు సల్మాన్ పాషా
Published: Friday November 25, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 24, ప్రజాపాలన: స్వచ్చందంగా రక్తదానం చేసిన విద్యార్థి నాయకుడు సల్మాన్ పాషా గురువారం రోజు వారి అన్నయ్య కుమారుడు రిహాన్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల లోని ఐ ఆర్ సి ఎస్ లో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు రక్తదానం విషయంలో ముందుండి ఆపత్కాలంలో రక్తం లేక చావు బారిన పడుతున్న వారిని కాపాడెందుకు ప్రతి 3,4 నెలల కు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ జుమ్మిడి గోపాల్ లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: