మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

Published: Tuesday August 10, 2021
మధిర, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీసీఎల్పీ నేత స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క  ఆదేశాలతో ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సూరం శెట్టి కిషోర్ గారు హాజరై కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ విభాగం ద్వారా పరిచయమైన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధాని కాగలిగారు అని అలాగే క్రియాశీల రాజకీయాల్లో యువకుల యొక్క పాత్ర చాలా అవసరమని యువత కాంగ్రెస్ పార్టీకి పెట్టని గోడ వంటిదని కొనియాడారు అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ యువత లో చాలా మేధస్సు దాగి ఉందని వారి యొక్క తెలివితేటలు రాజకీయంగాఆర్థికాభివృద్ధికిఅవసరముంటుందని  వివేకవంతమైన యువత ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన కై పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ భావజాలం కు అనుబంధం గా పని చేయాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి అంటే యువత కాంగ్రెస్ పార్టీ భావజాలంపై పనిచేయాలని అందుకు కాంగ్రెస్ పార్టీ  యువతకు ఎప్పుడు  అండగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా కేకును కట్చేసి మిఠాయిలు పంచారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు. కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి. పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఉద్దండ య్య. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ .ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు మహమ్మద్ అలీ. సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు. కర్ణాటక రామారావు. కౌన్సిలర్లు మునుగోడు వెంకటేశ్వర్లు .షేక్ ఫరీద్. పత్తేపుర పు సంగయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు నెల్లూరు విజయ్ ఆవుల కార్తీక్ కోటా చంటి దోమల సురేష్ కనక పూడి గోపాల్ .షేక్ జాన్ బాషా. ఆదిమూలం శ్రీను. మైలవరపు చక్రి .జమీర్ భాష. రహీం .సలీం భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు