దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి : టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కట

Published: Wednesday September 29, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : గత ఆరున్నర సంవత్సరాలుగా బదిలీలు లేక పాఠశాలలో మరీ ముఖ్యంగా మారుమూల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు పేరుకు పోయాయని వెనువెంటనే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ డిమాండ్ చేశారు. మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని పాఠశాలలో అధ్యాపకుల సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి కటకం రమేష్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని కోరుతూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన ఈ పరిస్థితుల్లో డి ఈ ఓ ఫుల్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు పాఠశాలలో కేటాయించి బదిలీలు పదోన్నతులు చేపడితే పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఆస్కారం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు. పాఠశాలలో స్కావెంజర్ పునర్నియామకం చేయాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాద్యులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, తుంగూరి సురేష్, జిల్లా బాధ్యులు జంగ గంగాధర్, కుంట భూమేశ్వర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్రం రాజు, నెరేళ్ల ప్రశాంత్, సాయికృష్ణ, టి.లింగన్న, ఉదయ్ కుమార్, విమల, జ్యోతి, రజిత పాల్గొన్నారు.