శరతులు లేకుండ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : కాంగ్రెస్ నేతలు తహశీల్దార్లకు వినతిపత్రాలు

Published: Thursday November 25, 2021

బీరుపూర్/సారంగాపూర్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ బీరుపూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. తప్పతాలు పేరుతో ఎలాంటి కటింగ్ లేకుండ వరి ధాన్యాన్ని మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కూడ కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని మరియు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీరుపూర్ తహశీల్దార్ అరిఫోద్దీన్ సారంగాపూర్ తహశీల్దార్ శ్రీలతకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీరుపూర్ ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మారమేష్ ప్రచార కార్యదర్శి గుడిసె జితేందర్ యాదవ్ పోల్సాని నవీన్ రావు పూడూరి రవి సారంగాపూర్ బీరుపూర్ పార్టీల అధ్యక్షులు చేరుపురి శుభాష్ కొండ్ర రాంచందర్ రెడ్డి జోగి రెడ్డి బదినపల్లి శంకర్ యశోద శ్రీనివాస్ చీర్నేని శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.