అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

Published: Wednesday November 23, 2022
: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలంలోని అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో జరుగున్న అభివృద్ధి పనులు మరింత మెరుగుపడాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలన్నారు.
"మీతో నేను" కార్యక్రమంలో గ్రామాల్లోని అత్యవసర సమస్యలు వెంటనే పరిష్కరించడం జరుగుతుందని, దీర్ఘకాళిక సమస్యలకు ఒక్కొకటిగా పరిష్కారం చేసేలా కృషి చేద్దామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలందిస్తున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ లు, ఐకేపీలు పంచాయతీ కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు విఓఎ లు పాల్గొన్నారు.