పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథం

Published: Thursday April 14, 2022
నారాయణపురం తెలుగుదేశం గ్రామ శాఖ ఘన స్వాగతం
బోనకల్ ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చేరుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, నారాయణపురం తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ, మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, సాధినేని హనుమంతరావు, తెలుగు యువత కార్యదర్శి మైనేని రవికుమార్, మండల కార్యదర్శి మరీదు బరకయ్య, నారాయణ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు చావా హనుమంతరావు, తెలుగుదేశం నాయకులు సూర్యదేవర అప్పారావు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.