ఘనంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుట్టినరోజు వేడుకలు

Published: Tuesday June 01, 2021

బెల్లంపల్లి, మే 31, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 47 వ జన్మదిన వేడుకలు కార్యకర్తలు తన విడిది కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నాడు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా స్థానిక  శ్రీ లక్ష్మీ హాస్పిటల్ లో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, హాజరై కరోనా నిబంధనలు పాటిస్తూ రక్తదానం చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి పుట్టినరోజు వేడుకల్ని కార్యకర్తలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి బీమాగౌడ్, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్ పి టి సి లు, ఎంపీటీసీలు, బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ శ్వేత శ్రీధర్, వైస్ చైర్మన్ బి, సుదర్శన్, కౌన్సిలర్లు గెళ్లి రాజలింగు, రమేష్, కో ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు కొమ్మెర లక్ష్మణ్, శివ, హనీఫ్, సాన శ్రావణ్, సన్ని బాబు, మల్లయ్య, ఇతర ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్వి నాయకులు బడికల శ్రావణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.