కంటి వెలుగు క్యాంపును తనిఖీ చేసిన ఎంపీడీఓ బృందం

Published: Saturday January 21, 2023

బోనకల్, జనవరి 20 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధి లో రామాపురం ,గార్లపాడు గ్రామాల్లో జరుగుతున్న తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాంను రెండవరోజు ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ బృందం సందర్శించి కంటి వెలుగు క్యాంపు వివరాలను హాజరైన ప్రజల యెక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన కంటి అద్దాలు వెంటనే వారికీ అందించాలి అని వివరించారు. అదే విధంగా ఎంపీవో సుబ్రహ్మణ్య శాస్త్రి కూడ క్యాంపును సందర్శించి టార్గెట్ పూర్తి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో పిహెచ్సి కంటి వెలుగు సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.