పీర్జాదిగూడలో వంటగ్యాస్ పెంచినందుకు నిరసనగా ధర్నా

Published: Friday March 03, 2023
మేడిపల్లి, మార్చి 2 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర బీజేపి ప్రభుత్వం, మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సామాన్యుల నడ్డి విరుస్తూ వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు నిరసనగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతిరి హరి శంకర్ రెడ్డి, కౌడే పోచయ్య, సుభాష్ నాయక్, నవీన్ రెడ్డి, అనంతరెడ్డి, బచ్చ రాజు, బీఆర్ఎస్ నాయకులు                 లేతాకుల రఘుపతి రెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, మనోరంజన్ రెడ్డి, నిర్మల బొడిగె కృష్ణ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.