మండలం లో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday April 19, 2022
పలు కుటుంబాలకు పరామర్శ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బోనకల్, ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామన్నపేట గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా గ్రామ సర్పంచ్ కిన్నెర వాణి ప్రమాదవశాత్తు జారి పడి గాయాలు కావడంతో వారిని పరామర్శించారు. అనంతరం బైపాస్ సర్జరీ చేయించుకున్న మందడపు నాగేశ్వరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరణించిన ఉయ్యూరి సూర్యకుమారి కుటుంబాన్ని, మరీదు రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నారాయణపురం గ్రామంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 3 లక్షల 24 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల టిఆర్ఎస్ నాయకులు ఇటుకల శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు వివిధ హోదాల్లో ఉన్న టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.