మున్సిపాలిటీ పరిధిలోరైస్ మిల్లులో చోరీయత్నం
Published: Thursday November 10, 2022
మధిర నవంబర్ 9 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని లడక బజారులో ఉన్న ఒక రైస్ మిల్లులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైస్ మిల్లులో ఉన్న గది తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సిసి ఫుటేజీలో నమోదయింది. క్యాష్ లాకర్ ను ఓపెన్ చేయగా డబ్బులు ఏమీ లేకపోవడంతో అందులో ఉన్న రసీదులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయాడు. బుధవారం మధిర టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఇటీవల దొంగలు వరుసగా చోరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మధిర యూనియన్ బ్యాంకులో కూడా ఒక వ్యక్తి చోరీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన సంఘటన సిసి ఫుటేజీలో నమోదయింది. తాజాగా మిల్లులో చోరీ చేసేందుకు దొంగల ప్రయత్నం చేశారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network: